మెదక్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించిన విషయానికి ప్రాధాన్యత తగ్గించడానికి మెట్రో వివాదాన్ని కొందరు తెరమీదకు తెచ్చి ఉండవచ్చన్న అనుమానాన్ని ఐటి,పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యక్తం చేశారు. తాను కూడా మీడియాలోనే ఈ విషయాన్ని చూశానని అన్నారు.సరిగ్గా ఉప ఎన్నిక ఫలితం వెలువడిన రోజునే ఈ లేఖ బయటకు రావడం వెనుక ఏదో ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే గతంలో కూడా ఎల్.అండ్ టి సంస్థ వారు తమ ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.పనులు ఎక్కడా ఆగలేదని, కాకపోతే కొన్ని చోట్ల మార్పు విషయంలో పరిశీలించాలని ప్రభుత్వం కోరిందని ఆయన అన్నారు.దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా స్పందించే అవకాశం ఉందని కెటిఆర్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: