మరి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చాలా ఉత్సాహంతో ఉన్నట్టున్నాడు. ఆ ఉత్సాహంతో వచ్చే 20 యేళ్ల అధికారం తమ చేతిలోనే ఉంటుందని ఆయన చెబుతున్నాడు. అంతే కాదు.. రానున్న కాలంలో ఏపీ ముఖ్యమంత్రులుగా ఎవరుంటారో కూడా ఆయన చెప్పాడు. కొన్ని సంవత్సరాల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటాడని ఆయన అనంతరం లోకేశ్ బాబు ముఖ్యమంత్రి అవుతాడని ప్రత్తిపాటి చెబుతున్నాడు. లోకేశ్ బాబును కాబోయే ముఖ్యమంత్రిగా కీర్తించాడు పుల్లారావు. అధికారంలో ఉన్న వారికి ఇలాంటి అతి విశ్వాసం చాలా సహజమే. ఎవరు అధికారంలో ఉంటే వారు తామే శాశ్వతం అనే భ్రమలో బతుకుతూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ల వంతు వచ్చింది. అందుకు రుజువుగా పుల్లారావు 20 అధికారంలో ఉంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. అన్నేళ్ల పాటు బాబు ముఖ్యమంత్రిగా ఉండలేడని.. లోకేశ్ ను తర్వాత ముఖ్యమంత్రిగా చేసుకొంటామని ఆయన ప్రకటించాడు. మరి ఎన్టీఆర్ కు ఎలాంటి అవకాశం ఉండదని కూడా పుల్లారావు మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ముందు చంద్రబాబుతర్వాత లోకేశ్ బాబులు సీఎం అవుతారు.. అంటే ఎన్టీఆర్ కు గానీ, బాలయ్యకు గానీ అవకాశం లేదని తెలుగుదేశం నేతలే స్పష్టం చేసినట్టు అవుతుంది. మరి ఇది పుల్లారావు వ్యక్తిగత ప్రకటనా.. లేక తెలుగుదశం పార్టీ అధికారిక ప్రకటనా?

మరింత సమాచారం తెలుసుకోండి: