పోలవరం ముంపు మండలం అయిన ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలంలో గురువారం ఆంధ్రా అధికారులు పర్యటించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ నేతృత్వంలో ఆ జిల్లా ఉన్నతాధికారులు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాసరావు కుక్కునూరులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు జై తెలంగాణ అంటూ సమావేశ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఏలూరు ఎంపి మాగంటి బాబు అనుచరులు వారిని అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలకు వ్యతిరేకంగా జై ఆంధ్రా అంటూ వారు కూడా బిగ్గరగా నినదించారు. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును, కార్యకర్తలను నెట్టుకుంటూ ముందుకు వచ్చారు. మాగంటి బాబు అనుచరులు ఒక్కసారిగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హుటాహుటిన కుక్కునూరు వచ్చారు. ఎమ్మెల్యే తాటితో కలిసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు

మరింత సమాచారం తెలుసుకోండి: