కేంద్ర మంత్రి సదానందగౌడ తనయుడు కార్తిక్ తనను మోసం చేశాడని.. వివాహం చేసుకొంటానని చెప్పి వంచనకు గురి చేశాడని ఆరోపించిన కన్నడ నటి మైత్రేయ వ్యవహారం న్యూ టర్న్ తీసుకొంది. రివర్స్ లో ఇప్పుడు మైత్రేయపై కేసు నమోదయ్యింది. ఆమె తనను పెళ్లి చేసుకొందని.. కాపురానికి రమ్మంటే రావడం లేదంటూ కన్నడ దర్శకుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను కాపురానికి పంపండి అంటూ అతడు ఫిర్యాదు చేశాడు. కార్తిక్ పై ఈ మైత్రేయ ఎలాంటి ఆరోపణలు చేసిందో... మైత్రేయపై కూడా ఆ దర్శకుడు అలాంటి ఆరోపణలే చేశాడు. తామిద్దరికీ పెళ్లి అయ్యిందని మైత్రేయ చెబుతుంటే.. మైత్రేయను తను పెళ్లి చేసుకొన్నాను అంటూ ఆ దర్శకుడు చెబుతున్నాడు. తనకు కార్తిక్ ను అప్పగించాలని మైత్రేయ కోరుతుంటే.. మైత్రేయను తనకు అప్పగించాలని సినిమా దర్శకుడు పోలీసులను కోరుతున్నాడు. మరి దీంతో మైత్రేయ ఇబ్బందుల్లో పడిపోయినట్టేనని చెప్పవచ్చు. ఆమె కార్తిక్ పై అత్యాచార ఆరోపణలు చేస్తోంది. ఒకవైపు మోడీ సర్కార్ లో సదానందగౌడ మంత్రిగా ఉంటే... ఆ స్థాయి వ్యక్తి తనయుడిపై మైత్రేయ ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనమేనని చెప్పవచ్చు. అది కూడా అతడికి పెళ్లి కుదిరిన సమయంలో ఆమె రంగంలోకి దిగింది. సదానంద ఫ్యామిలీని ముప్పుతిప్పలు పెడుతోంది. మరి ఇప్పుడు మైత్రేయపై రివర్స్ లో కేసు పెట్టడం జరిగింది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది? వీటిల్లో ఏ కేసు నిజం? ఏది అబద్ధం అనేవి? ఆసక్తికరమైన అంశాలయ్యాయి. ఏదేమైనా మైత్రేయ వ్యవహారంతో సదానంద ఇమేజ్ కు డ్యామేజి వచ్చిందనేమాత్రం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: