చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై రెండు సంవత్సరాల్లో రావాల్సిన ప్రజా వ్యతిరేకత రెండు నెల్లోనే వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం అనంతపురం జిల్లాలో పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ టీడీపీ నేతల దౌర్జన్యాలపై ఎప్పటికప్పుడూ స్పందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బాధితులకు వైఎస్ఆర్ సీపీ నేతలు భరోసా ఇవ్వాలని సూచించారు. ''సాధ్యంకాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ మోసాలను ప్రజలు గ్రహించారు... ప్రజలు ఇప్పుడు మనవైపు చూస్తున్నారు...వారికి అండగా ఉద్యమాలు చేద్దామని'' వైఎస్ అన్నారు. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలపై అక్టోబర్ 16న మండల కార్యాలయాలు ముట్టడికి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: