టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పదే,పదే అబద్దాలు చెప్పి వాటిని నిజాలుగా జనాన్ని నమ్మించాలని చూస్తున్నారని టిఆర్ఎస్ ఆరోపించింది.ఆ పార్టీ ఎమ్మెల్యేలు జూపల్లె కృష్ణారావు, లక్ష్మారెడ్డి, బాలరాజులు మీడియాతో మాట్లాడుతూ,మెట్రో రైలు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.ఎల్ అండ్ టీ సంస్థకి ఆంధ్ర రాజధానిని ఎరవేసి... ఇక్కడి మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థను తప్పించి ఆంధ్ర రాజధానికి పంపించాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని జూపల్లె ఆరోపించారు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు విక్రయించిన భూములపై చర్చకు సిద్ధమేనా అని ఆయన అన్నారు. బహిరంగ చర్చ జరిగినా, జరగకపోయినా, శాసనసభలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది.అప్పుడు ఏది వాస్తవం, అవాస్తవం అన్న విషయాలు బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: