బాలీవుడ్ నటి శిల్పాశెట్టి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. పంజాబ్ లోని కపూర్తలా ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఒక స్టోర్ ప్రారంభోత్సవానికి జలంధర్ నుంచి అమృతసర్ వెళ్తున్నప్పుడు శిల్పాశెట్టి ప్రయాణిస్తున్న కారును ధిల్లవాన్ టోల్ ప్లజా సమీపంలో మరో కారు ఢీకొంది. దీంతో ఆమె అంగరక్షకులు కారు డ్రైవర్ తో గొడవ పడ్డారు. ఈలోపు మరో్ కారులో శిల్పాశెట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న శిల్పాశెట్టి ఇటు సినీరంగంతో పాటు అటు వ్యాపార రంగంలో కూడా బాగా నిలదొక్కుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: