జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖ బయల్దేరారు. ఈరోజు సాయంత్రం ఆయన విశాఖలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా పవన్ పర్యటిస్తారు. కాగా హుదూద్ బాధితులకు పవన్ కళ్యాణ్ నిన్న రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం సహాయ నిధికి ఆయన ఈ విరాళాన్ని అందించనున్నారు. మరోవైపు తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: