ప్రముఖ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయనతో కలిసి మీడియాతో మాట్లాడారు. తుపాను సమయంలో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడిందని పవన్ కళ్యాణ్ అన్నారు.విభజన సమయంలో జరిగిన ఎన్నికలలో తాను చంద్రబాబుకు అనుభవం ఉందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విశాఖపట్నానికి జరిగిన తుపాను నష్టం తీవ్రంగా ఉండడం బాధాకరమని ఆయన అన్నారు.తుపాను బాధితులకోసం తక్షణ సాయం ప్రకటించిన ప్రధాని మోడీకి, ప్రజలకు అండగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. తాను ప్రకటించిన ఏభై లక్షల రూపాయల విరాళం చెక్కును కూడా ముఖ్యమంత్రి కి పవన్ కళ్యాణ్ అందచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: