రాష్ట్ర బీజేపీలో ఎమ్మెల్సీ లొల్లి మొదలైంది. త్వరలో స్టేట్ లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేశారు బీజేపీ లీడర్లు. ఒకరికి తెలియకుండా మరోకరు లాబీయింగ్ ముమ్మరం చేశారు. నెక్ట్స్ ఇయర్ మొత్తం 17 MLC సీట్లు ఖాళీ కానున్నాయి. ఇందులో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల విషయంలో బీజేపీలో అప్పుడే వాతావరణం హీటెక్కింది. మరోవైపు టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులు అధిష్టానం దృష్టిని ఆకర్శించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి పార్టీ అధికార ప్రతినిధి రాంచందర్ రావు, మాజీ MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి ప్రధాన పోటిదారులుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: