అమ్మకు బెయిల్‌కు మంజూరు కావడంతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన జయలలితకు ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జయకు బెయిల్ రావడంతో ఏఐఏడీఎంకే కార్యకర్తలు పండుగ చేసుకున్నారు. తమిళనాడులోని ప్రధాన కూడళ్లలో బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. అమ్మకు బెయిల్ లభించడంతో పలువురు మహిళలు సంతోషంతో ఆనంద భాష్పాలు రాల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: