అక్కినేని నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ సినిమా వంశీ పైడి పల్లి దర్శకత్వంలో రాబోతోంది అనే వార్తలు గతంలో చాల సార్లు వచ్చాయి. నాగార్జున కూడా ఈ సినిమా పై వస్తున్న వార్తలను ఖండించకుండా ఇంకా ఆ సినిమాకు సంబంధించి కధ పూర్తిగా తయారు కాలేదు అంటూ సమాధానాలు చాల సార్లు దాట వేసాడు.  పివిపి బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఏమి జరిగిందో తెలియదుకాని ఈ సంవత్సరాంతం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో జూనియర్ ప్లేస్ లో కోలీవుడ్ హీరో కార్తి వచ్చి చేరాడు అనే వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  కోలీవుడ్ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి పేరు ఉంది కాబట్టి ఈ మార్పు చేసారా? లేదంటే మల్టీ స్టారర్ గా తీస్తున్న ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేస్తే ఇప్పటికే కార్తీకి ఉన్న కోలీవుడ్ మార్కెట్ రీత్యా అక్కడ కూడా ఈ సినిమాకు మినుమమ్ గ్యారంటీ ఉంటుంది అన్న ఆలోచనతో ఈ మార్పులు చేసారా? అనే విషయం పై రకరకాల భిన్న కధనాలు వినపడుతున్నాయి.  అయితే ఇప్పటకే పరాజయాల బాటలో నడుస్తున్న జూనియర్ ఈ మల్టీ స్టారర్ సినిమా కధ నచ్చక తప్పుకున్నాడు అనే మాటలు కూడా ఉన్నాయి. ఈ వార్తలు ఎలా ఉన్నా నాగార్జునతో ఒక మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాసం కార్తీకి రావడం టాలీవుడ్ లో ఇతడి క్రేజ్ ను పెంచే అవకాసం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: