ప్రజల్లో తీవ్రమైన గందరగోళానికి దారితీసిన వంటగ్యాసు-ఆధార్-బ్యాంకు ఖాతా లింకేజీ మళ్లీ వస్తోంది. కాకపోతే గందరగోళం లేకుండా చూస్తామని మోడీ ప్రభుత్వం హామీ యిస్తోంది. గతంలో వంట గ్యాస్పై యుపిఎ ప్రభుత్వ చేపట్టిన నగదు బదిలీ పథకం మరోసారి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదముద్ర వేసింది. ఈ నగదు బదిలీ పథకం నవంబర్ నుంచి అమల్లోకి తీసుకురా నున్నట్లు కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. గ్యాస్ ధరపై కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్న కేంద్ర కేబినెట్ ఈ రోజు సమావేశమైంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి గ్యాస్ ధరపై పున్ణసమీక్ష నిర్వహి స్తామని కేంద్ర కేబినెట్ తెలిపింది. ప్రతీ ఏటా ఏప్రిల్ 1 వ తేదీన, అక్టోబర్ 1 వ తేదీన గ్యాస్ ధరపై సమీక్ష చేపట్టనుంది.
యూనిట్ ధరను 5.61 యూఎస్ డాలర్గా నిర్దారిస్తూ నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్కు పూర్తి స్థాయిలో నగదు బదిలీకి పథకాన్ని అమలు చేస్తామని.. దీంతో వినియోగ దారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీని వర్తింప జేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. యూపీఏ అమలు చేసిన పథకాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ ఆధార్ అనుసంధానంతో గ్యాస్ సబ్సిడీని పొందిన వంట గ్యాస్ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. అయితే తాజాగా అదే పథకాన్ని తెరపైకి తీసుకురావడంతో ఆధార్ను బ్యాంక్ల్లో అనుసంధానం చేసుకోవాల్సిన పరిస్థితి.
దేశంలో అధిక సంఖ్యలో ఆధార్ నమోదు చేసుకు న్నా.. ఇంకా చాలా మందికి ఆధార్ నంబర్ లభించ లేదు. ఈ పథకంతో పూర్తి స్థాయి లబ్ధి చేకూరా లంటే మాత్రం వినియోగదారులకు ఆధార్ తిప్పలు తప్పకపోవచ్చు. అయితే త్వరలో అమల్లోకి రానున్న నగదు బదిలీ పథకాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహి స్తామని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: