ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశంలేదు. బీజేపీ ఎక్కువ స్థానాలలో మెజార్టీలో ఉంది. అయితే ఆ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడంలేదు. శివసేన రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానం కోసం కాంగ్రెస్, ఎన్సీపి పోటీ పడుతున్నాయి. రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి(ఎంఎన్ఎస్) 4 స్థానాలలో మాత్రమే ఆధిక్యతలో ఉంది. హర్యానాలో బీజేపీ 51 స్థానాలలో లీడింగ్తో మెజార్టీ స్థానాలు గెలుచుకునే దిశగా వెళుతోంది. ఇక్కడ బీజేపి ఎవరి మద్దతులేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి ఎందిగింది. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఆ పార్టీకి పరాభవమే మిగిలింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆధిక్యతలో ఉన్న పార్టీల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం: మహారాష్ట్రలో మొత్తం స్థానాలు - 288 బీజేపీ ఆధిక్యం - 108 శివసేన - 65 కాంగ్రెస్ - 50 ఎన్సీపి- 43 ఎంఎన్ఎస్ 4 ఇతరులు - 18 హర్యానాలో మొత్తం స్థానాలు - 90 బీజేపీ ఆధిక్యం - 48 కాంగ్రెస్ - 14 ఐఎన్ఎల్డీ- 20 హెచ్ జేసీ - 03 ఇతరులు - 5

మరింత సమాచారం తెలుసుకోండి: