ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమను పట్టించుకోవడం లేదని ఆనంతపురం మాజీ ఎమ్.పి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు.నీటి కష్టాలతో రాయలసీమ అల్లాడుతున్నదని ,అయినా ప్రభుత్వం శ్రద్దపెట్టడం లేదని ఆయన విమర్శించారు. చంద్ర బాబు ఒక ప్రాంతానికే సీఎంలా వ్యవహరిస్తున్నారన్నారని ఆయన ధ్వజమెత్తారు.సీమ ప్రయోజనాలను పట్టించుకోకుండా, సాగర్,పులిచింతల ప్రాజెక్టులకే నీటిని వదలి పెడుతున్నారని ఆయన ఆరోపించారు.ఇంతవరకు ఎనభై టి.ఎమ్.సి. నీటిని తరలించారని ఆయన విమర్శించారు.కండ బలం ఉన్నవారే తాగు నీరు తీసుకుపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు.ప్రాంతీయ కోణంలో చంద్రబాబును ఇరుకున పెట్టాలని అనంత వెంకట్రామిరెడ్డి ప్రయత్నించారా!

మరింత సమాచారం తెలుసుకోండి: