మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై డైలమా ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీకి మద్దతు ఇచ్చే అంశంపై శివసేన పార్టీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. శివసేన అత్యవసర సమావేశం ముగిసింది. పార్టీ వైఖరి మాత్రం స్పష్టం కాలేదు. బీజేపితో కలవాలా? వద్దా? అనేది ఇంకా తేలలేదు. మద్దతుపై నిర్ణయం తీసుకునే అధికారం పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు అప్పగించారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలా? వద్దా?, ఇస్తే మంత్రి మండలిలో ఏఏ పదవులు కోరాలి అన్న అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: