ఆంద్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ వద్ద తొలి ఆపీస్ ఏర్పాటైంది.రైతుల రుణమాఫీతో పాటు రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఆరంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు దీనికి ప్రారంభోత్సవం చేశారు. గన్నవరంలోని పశువైద్య కశాశాల ప్రాంగణంలో ఈ ఆఫీస్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ వద్ద రాజదాని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పట్టికీ ఇంతవరకు కార్యాలయాల తరలింపు ఆరంభం కాలేదు.కొత్త రాజధాని గుంటూరు జిల్లా వైపు ఏర్పాటు చేస్తామని భూమి సేకరణపై దృష్టి పెట్టారు.ఈ తరుణంలో గన్నవరంలో కొత్త ఆఫీస్ ను ఆరంబించడం ద్వారా రాజధానిలో కార్యకలాపాలు ఆరంభించినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: