ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పావులు కదిపారు. ఇందులో భాగంగా మహరాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జిగా పనిచేసి, అక్కడ పార్టీని బలోపేతంలో కీలక పాత్ర వహించిన రాజీవ్ ప్రతాప్ రూడీ ని ఏపీ వ్యవహారాల బాధ్యతలను అప్పగించింది. కాగా బీహార్ లోని సరన్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం రబ్రీదేవిపై సంచలన విజయం సాధించిన రూడీ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఏపీలో కమలం బలపడేందుకు అనువైన పరిస్థితులున్నాయని, ఆమేరకు కార్యకర్తలు కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఇంఛార్జిల నియామకంలో రూడీని ఏపీకి నియమించడం ద్వరా తన మనోగతాన్ని మరోసారి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: