వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఒక మాస పత్రికను తీసుకురావాలని సంకల్పించింది.ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి వెల్లడించారు.పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతాలను కార్యకర్తలకు మరింత చేరువ చేసేందుకు ఈ పత్రిక ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.అలాగే ఒక నెట్ టీవీని కూడా ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.దీనివల్ల దేశ,విదేశాలలోని పార్టీ అబిమానులు పార్టీ విశేషాలు తెలుసుకునే వీలు ఉంటుందని అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు మార్చబోతున్నామని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: