వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్న సీనియర్ నేత,మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అసంతృప్తికి కారణం ఏమిటన్నదానిపై కధనాలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిని పెందుర్తి ఇన్ చార్జీ పదవి నుంచి తప్పించడంపై కొణతాల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.దాంతో ఆయన ఆగ్రహం చెంది పార్టీ అద్యక్షుడు జగన్ కు ఘాటైన లేఖ రాశారు. గండి బాబ్జి గతంలో పరవాడ నుంచి ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కొణతాలకు అత్యంత సన్నిహితుడు. ఆయన కు కిందటిసారి పెందుర్తి నుంచి పోటీచేసే అవకాశం ఇచ్చారు.కాని ఆయన పదిహేను వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఇటీవల పార్టీలో మార్పులు,చేర్పులు చేస్తున్న సందర్భంగా బాబ్జిని ఆ పదవి నుంచి తప్పించారు.అయితే ఈ విషయం కొణతాలతో చెప్పినట్లు లేరు.దీనిపై ఆగ్రహానికి గురై జగన్ ను నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: