వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కొణతాల రామకృష్ణపై ఆ పార్టీ అద్యక్షుడు జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.కొణతాల ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకోండని పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి తదితరులకు పురమాయించారని కధనం.ఆయన ఇబ్బంది ఏమిటో తెలుసుకోవాలని సూచించగా, వారు కొణతాలకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు.కాని కొణతాల అందుబాటులోకి రాలేదు.తర్వాత అయినా తెలుసుకోండని వారితో జగన్ చెప్పారు.అయితే కొణతాల రాసిన లేఖపై జగన్ కాని, పార్టీ ఇతర నేతలు కాని స్పందించలేదు. అయితే కొణతాల ఇప్పటికీ మా పార్టీ నాయకుడే అని అదికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు.కాగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి తాను హైదరాబాద్ వెళితే జగన్ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని అన్నారు. జగన్ విశాఖ వచ్చినప్పుడు తాను పని ఉండి హైదరాబాద్ వెళ్లానని ఆ తర్వాత తనను మార్చారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: