ఒకవైపు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని రాజకీయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పై తెలుగు తమ్ముళ్లు కొత్త రూట్లో రీవేంజ్ కు సిద్ధం వుతున్నారు. ఇప్పటికే కరెంటు కష్టాలు, రైతుల ఆత్మహత్య లు వంటి వ్యవహారాలను ఆయుధాలుగా చేసుకొని కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చే్స్తున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు మరో విధంగా కూడా పోరాటం మొదలు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఆత్మహత్య చేసుకొన్న రైతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందట. మొత్తం మూడువందలకుమంది కి పైగా రైతులు త్మహత్య చేసుకొన్నారని.. ఇలాంటి వారందరి కుటుంబాలన్నింటికీ పరిహారం అందించాలని తెలుగుదేశం భావిస్తోందట! ఇలా అందరికీ డబ్బు ఇస్తూ పోయినా అది పెద్ద మొత్తం ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీకి అదేం పెద్ద భారం కాదు. అయితే రాజకీయంగా మాత్రం ఇది సూపర్ మైలేజ్ ను ఇస్తుందని తెలుగుదేశం పార్టీ ావిస్తోందట. అందుకే ఈ రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని భావిస్తోందట. అలా డబ్బులు ఇస్తే రైతుల్లో తెలుగుదేశం పార్టీకి పట్టు పెరుగుతుందని.. కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని తెలుగుదేశం పార్టీ లెక్కలేసుకొంటున్నట్టుగా తెలుస్తోంది! మరి ఈ డబ్బు ప్లాన్ బాగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏ మేరకు వర్కవుటవుతుందో వేచి చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: