ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణ మోహన్ భారతీయ జనతా పార్టీలో చేరవచ్చని కధనాలు వస్తున్నాయి. గత ఎన్నికలలో చీరాల నుంచి ఇండిపెండెంటుగా గెలిచిన కృష్ణమోహన్ టిడిపికి మద్దతు ఇవ్వదలిచారు.ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలిశారు. కాని చీరాల నియోజకవర్గంలో తనపై పోటీచేసి ఓడిపోయిన టిడిపి అభ్యర్ధి పోతుల సునీతతో నిత్యం తగాదా వస్తుండడంతో ఆమంచి ఇప్పుడు బిజెపి లోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించిన నేపద్యలో ఆమంచి కూడా అదే ప్రతిపాదన చేస్తున్నట్లుగా ఉంది. ఈయన కూడా కాపు సామాజికవర్గం కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: