మా పార్టీలో చేరండి…మీకో బంపర్ ఆఫర్ అంటూ కొత్త స్కీమ్ తెస్తోంది టీడీపీ. బస్సు ఛార్జీల్లో రాయితీలు. ఆస్పత్రి బిల్లులో డిస్కౌంట్లు. ప్రమాదంలో చనిపోతే ఇన్సూరెన్స్. ఆ పార్టీలో చేరితే వచ్చే బెనిఫిట్స్ ఇవి. సైకిల్ పంక్చరైనందున…. తమ్ముళ్లు కారెక్కుతున్నారు. క్యాడర్… గులాబీలో కలిసిపోతోంది. బస్సు యాత్రలు, ధర్నాలు… జంప్ జిలానీలను ఆపలేకపోతున్నాయి. ఇంకా కొంతమంది పార్టీని వదిలిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీని కాపాడుకోవడం హైకమాండ్ కు పెద్ద సవాల్ గా మారింది. అందుకే కొత్త ప్లాన్ వేసింది. పార్టీలో చేరితే చాలు హెల్త్ కార్డులు పొందొచ్చు. మల్టీ పర్పస్ కార్డ్ ద్వారా ఇన్సురెన్స్, డిస్కౌంట్ పొందే ఛాన్సు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రమాదంలో చనిపోతే 2 లక్షల ఇన్సురెన్స్, రోగాలతో ఆస్పత్రిలో చేరితే ప్రైవేట్ హాస్పిట్ ల్లో 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. పార్టీతో అసోసియేట్ అయిన ట్రావెల్స్ లో ప్రయాణిస్తే ఛార్జీల్లో రాయితీలు కల్పిస్తున్నారు. మల్టిపర్పస్ కార్డులకు అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… ఈ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులోకి వస్తాయని టీడీపీ నేతలు గొప్పగా చెబుతున్నారు. 10 రూపాయాలు చెల్లిస్తే సాధారణ సభ్యత్వం, వంద రూపాయాలు కడితే క్రియాశీలక సభ్యత్వాలు వారం రోజుల్లో మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆఫర్లకు జనం నుంచి మంచి స్పందన వస్తుందనే ధీమాతో ఉన్నారు. అందుకే పచ్చచొక్కా వేసుకోండి…బంపర్ ఆఫర్ పొందండి అంటూ ప్రచారం చేస్తున్నారు తమ్ముళ్లు. ఈ కొత్త స్కీమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో త్వరలోనే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: