తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు అవినీతి వ్యవహారాల బండారం బయటపెడతామని కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రూ అన్నారు. అనంతపురం నగరంలో గురువారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ లోకేష్ రూ. 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. వీటన్నింటినీ రికార్డులతో రుజువుచేస్తామన్నారు. ఒకే వ్యక్తి నుంచి 125 ఎకరాల భూమి కొన్నట్లు రికార్డులు కూడా ఉన్నాయన్నారు. వీటన్నింటి రికార్డులు సేకరిస్తున్నామని, త్వరలో రుజువులతో సహా విజయవాడలో బహిరంగసభ ఏర్పాటు చేసి బయటపెడతామన్నారు. నిపుణులు లేకుండా తాబేదార్లతో రాజధాని కమిటి ఏర్పాటుచేసి రోజుకోదగ్గర రాజధాని అంటూ నాటకాలాడారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. రాజధాని కమిటీలో ఒక్కరైనా నిపుణుడు ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: