జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపడం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నవంబర్ -ఒకటిన ఏర్పడిందని, ఇతర భాషాప్రయుక్త రాష్ట్రాలు కూడా అదే తేదిన అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలు విడిపోయినప్పుడు .. విడిపోయిన భాగం మాత్రమే కొత్త అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారాయన. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. నవంబర్ ఒకటినే అవతరణ దినోత్సవంగా పార్టీ తరపున వేడుకలు నిర్వహిస్తామని మైసూరారెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: