నంద్యాలలో టిడిపి పిలుపు మేరకు బంద్ జరుగుతోంది.నంద్యాల మున్సిపాల్టీ సమావేశంలో టిడిపి సభ్యులపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడి జరిపారని ఆరోపిస్తూ టిడిపి నేతలు బంద్ కు పిలుపు ఇచ్చారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి , తదితరులు బంద్ ను పర్యవేక్షిస్తున్నారు.నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పై హత్యయత్నం కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు.పోలీసులు ఆయన ఇంటి వద్ద, ఇతరత్రా పెద్ద ఎత్తున మొహరించారు.దీంతో నంద్యాలలో ఉద్రిక్తత ఏర్పడింది.నంద్యాల బంద్ లో విద్యాసంస్థలు,వ్యాపార సంస్థలన్ని మూతపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: