రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ టిడిపి ఎమ్మెల్యే అనుచరులు ఒక సినీ నటుడి బ్రహ్మాజి కుమారుడు సంజయ్ పై దాడి చేశారన్న ఫిర్యాదు వచ్చింది.ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద ప్రకాష్ గౌడ్ అనుచరులు దాడి చేసి వీరంగం చేశారని కధనం.సంజయ్ కు ఈ ఘటనలో గాయాలు అయ్యాయి.టోల్గేట్ వద్ద ప్రకాశ్ అనుచరులకు, సంజయ్కు మధ్య వాగ్వాదం జరిగిందని, దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు.బ్రహ్మాజీ కుమారుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సంజయే తమపై దురుసుగా వ్యవహరించారని ప్రకాష్ గౌడ్ అనుచరులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: