మరికొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఆదివారం కర్నాటక రాష్ట్రం పావగడలో కమ్మ బాలికల వసతి గృహం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూవస్తున్నానన్నారు. గత ఆరు నెలలుగా రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడలేదని, ప్రస్తుతం మాట్లాడటానికి వీలు కాదన్నారు. అతి త్వరలో మాట్లాడే సమయం వస్తుందని, అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతానన్నారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ రాజకీయాలకు దూరమవుతున్నానా, దగ్గరవుతున్నానా అన్నది ఇప్పట్లో చెప్పలేనని సమాధానం దాటవేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: