హర్యానాలోని వివాదాస్పద స్వామీజీ రాంపాల్ అరెస్టు అనేక కొత్త విషయాలను వెలుగులోకి తెస్తోంది. స్వామీజీ వి చాలా వికృత చేష్టలు అని వార్తలు వస్తున్నాయి. ఆశ్రమం అనబడబు ఆయన సామ్రాజ్యంలో జరుగుతున్న చర్యలు చాలా చాలా రోతగా ఉన్నాయి. అందుకు ఒక ఉదాహరణ ప్రసాదం తయారీ. స్వామీజీ ఆశ్రమంలో పాయసం రూపంలో తయారు అయ్యే ప్రసాదం గురించి అసలు కథ బయటకు వచ్చింది. ప్రతిరోజూ స్వామీజీ పాలతో స్నానం చేస్తాడని.. ఆ పాలతోనే పాయసం చేసి దాన్ని ప్రసాదంగా పంచుతారని తెలుస్తోంది. మరి ఇంతకన్నా పరాకాష్ట, స్వామీజీ పైశాచికత్వం మరోటి లేదని చెప్పవచ్చు. విగ్రహాలను క్షీరాభిషేకం చేసి.. ఆ పాలను ప్రసాదం గా స్వీకరించే పద్ధతి అక్కడక్కడ ఉంది. అయితే ఇలా ఒక మనిషి స్నానం చేసిన పాలను ప్రసాదంగా మార్చడం మాత్రం ఈ రాంపాల్ బాబా దగ్గరే జరుగుతోంది. అంతే కాదు.. ఆశ్రమంలో తన ఆంతరింగక సేవలో పాల్గొనే మహిళలను అర్ధనగ్నంగా ఉండాని ఈయన కోరేవాడట! ఇలాంటి విషయాలు ఇప్పుడే బయటకు వస్తున్నాయి. మరి ఆశ్రమాల, బాబాల ముసుగులో జరుగుతున్న దాష్టికాల పరంపర వరసగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే నిత్యానంద వంటి వాళ్ల కథలు బయటకు రాగా.. ఇప్పుడు రాంపాల్ వంటి వారి ముసుగు కూడా తొలగుతోంది. పేరుకు అధ్యాత్మిక వాదమే అయినా వీరి చేష్టలు మాత్రం చాలా చాలా వికృతంగా ఉంటున్నాయి. రాంపాల్ వ్యవహారాలపై కేసులు నమోదవుతున్న తీరును చూస్తుంటే ఇతడి పాపం పండే సమయం వచ్చినట్టుగా ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: