తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో భర్త దాడి చేసిన ఘటనలో భార్య మృతి చెందింది. వివరాల్లో వెళితే భార్య ....వేరే వ్యక్తితో కలిసి ఉండటం చూసిన భర్త ఆగ్రహం పట్టలేక దాడి చేశాడు. ఈ సంఘటనలో భార్య మృతి చెందింది. ఆదివారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే స్థానికంగా నివాసం ఉంటున్న బొండా అప్పారావు... తన భార్యతో అదే గ్రామానికే చెందిన సూరిబాబును చూసి భరించలేక ఆమెను దారుణంగా నరికేశాడు. సూరిబాబుపై కూడా దాడి చేయగా అతడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఓ వైపు తల్లి మృతి, మరోవైపు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో వారి ఇద్దరి పిల్లలు అనాధలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: