పెద్దఎత్తున ప్రభుత్వోద్యోగాలు ఇస్తామని ప్రకటించి, తెలంగాణలో నిరుద్యోగులకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన వరాలకు సంతోషం వ్యక్తం చేస్తూ వరంగల్ జిల్లాలో కెసిఆర్ కు పటానికి పాలాభిషేకం చేసారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో టీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు కెసిఆర్ కు పాలాభిషేకం చేసారు. ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్న కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కేసీఆర్ వల్లనే సాధ్యమని విద్యార్థులు అన్నారు. అర్హులందరికీ ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని ప్రకటించారు. విద్యార్థులు. విపక్షాలు ఎప్పటికైనా ప్రభుత్వం పై విమర్శలు ఆపాలని హితువు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: