ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరే నాథుడు ఎవరున్నారు? ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే, ఎంపీల హోదాల్లో ఉన్నవారు, దశాబ్దాల పాటు ఆ పార్టీలో ఉండి.. అనేకరకాలుగా లబ్ధి పొందిన వారే ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడప్పుడే కోలుకోలేదు.. ఆ పార్టీలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.. అనే అభిప్రాయాలతో బయటకు వస్తున్నారు. మరి ఆ పార్టీ నుంచి అందరూ ఇలా బయటకు వచ్చేస్తున్న తరుణంలో తమిళుల ఒకనాటి డ్రీమ్ గర్ల్ ఖష్బూ కాంగ్రెస్ లో చేరడం ఆసక్తికరంగా ఉంది. డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆమె కాంగ్రెస్ లో చేరింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె బీజేపీలోకి చేరితే పెద్దగా ఆశ్చర్యం లేదు. అయితే కాంగ్రెస్ లో చేరడం విశేషమే. దేశవ్యాప్తంగా ఎక్కడా కాంగ్రెస్ కు అనుకూలమైన పరిస్థితులు లేవు. అందులోనూ తమిళనాడులో అయితే ఏ మాత్రం అనుకూల స్థితి లేదు. వివిధ రాష్ట్రాల్లోఐదేళ్లకో పదేళ్లకో కాంగ్రెస్ పార్టీ కోలుకొనే అవకాశాలుంటాయేమో.. తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం చాలా చాలా కష్టం. మరి ఇటువంటి స్థితి ని తెలిసి కూడా ఖుష్భూ ఆ పార్టీలో చేరిందంటే.. అందుకే చాలా బలమైన రీజనే ఉండాలి! మరి ఆ రీజన్ ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: