రైల్వే శాఖ మరోసారి ఛార్జీల బాదుడుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్-లో టికెట్ -ఛార్జీల పెంపుదలను ప్రతిపాదించనున్నారు. విద్యుత్తు రుసుములు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. కరెంటు ఛార్జీల భారాన్ని ప్రయాణికులపై కొంతమేర మోపాలన్నది కేంద్రం నిర్ణయంగా కనిపిస్తోంది. ఇంధన రుసుముల ఆధారంగా టికెట్ ధరలను 6 నెలలకొకసారి సవరిస్తున్నారు. ఈ క్రమంలో చివరిగా జూన్ లో టికెట్లపై 4.2శాతం, సరకు రవాణాపై 1.4శాతం చొప్పున రైల్వే శాఖ ధరల్ని పెంచింది. మళ్లీ ఈ నెలలో ధరలను సవరించాల్సి ఉంది. పెంపును వచ్చే ఫిబ్రవరిలో చేపట్టబోతున్నట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో విద్యుత్తు, ఇతర ఇంధన రుసుములు నాలుగు శాతం పెరగడంతో కొత్త బడ్జెట్-లో టికెట్ ఛార్జీల పెంపును ప్రతిపాదించనున్నామని రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. నిర్వహణ వ్యయం పెరిగిపోతున్న నేపథ్యంలో కొంత భారాన్ని ప్రజలు కూడా మోయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: