తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ లో కొద్దిసేపటి క్రితం చేరిన కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు దాదాపుగా పూర్తి అయ్యింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత కొద్దిసేపటి క్రితం మొదలైన కేబినెట్ భేటీ అనంతరం కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖను కేటాయించనున్న కేసీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీలను అప్పగించనున్నారు. ఇంద్రకరణ్ రెడ్డికి న్యాయ, గృహనిర్మాణం.. జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖలు దక్కనున్నాయి. లక్ష్మారెడ్డికి విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్న సీఎం, చందూలాల్ కు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించాలని తీర్మానించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: