హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ప్రమాదం తృటిలో తప్పింది. అసోంలో బోడో తీవ్రవాదులు, ఆదివాసీలకు మధ్య జరుగుతున్న ఘర్షణతో ఉద్రిక్తత తలెత్తిన ప్రాంతాల పర్యటనకు వెళ్లిన ఆయన హెలికాప్టర్.. సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. అసోంలోని తేజ్ పూర్ ప్రాంతంలో రాజ్ నాథ్ బృందం ప్రయాణిస్తున్న చాపర్ ను అత్యవసరంగా దించారు. చాపర్ లో తలెత్తిన లోపాన్ని పైలట్ వెంటనే గుర్తించి దాన్ని దించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: