హైదరాబాద్: జూబ్లీహాల్ లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదానాకి సంబంధించి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి నేడు వ్యక్తిగతంగా విచారించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక దళ, భద్రతాదళ శాఖల పనితీరును త్వరలోనే సమీక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం హైదరాబాద్ జూబ్లీహాలులో కాంగ్రస్ శాసనసభ్యుల సమావేశంలో ప్రసంగించి వెళ్ళిన కొద్దిసేపటికే అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: