కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీడీపీకి గుడ్‌బై చెపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన త్వరలోనే తెరాసలో చేరతారని సమాచారం. ఈ మేరకు తెరాస ముఖ్యనేతలతో ఆయన చర్చలు ముగిశాయని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని సీమాం«ద్రులు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి నియోకజవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ప్రాథినిత్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఓ పత్రికలో తెలంగాణలో తేదేపా ఎమ్మెల్యేలపై తెరాస నాయకుల ఒత్తిడితో వారు విలవిల్లాడుతున్నారని.. పార్టీ మారకపోతే వారి ఆస్తులపై దాడులు కూడా తప్పవని బెదిరిస్తున్నారని కథనం వచ్చింది. తెరాస నాయకులు తేదేపా ఎమ్మెల్యేలను బెదిరించి తమ పార్టీలో చేర్చుకుంటున్నారన్నది ఆ పత్రిక కథనం సారాంశం. తెరాసలో చేరకపోతే తాము వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడతామని తేదేపా ఎమ్మెల్యేలు భయపడుతున్నారని కూడా ఆ పత్రిక కథనంలో పేర్కొంది. ఇక మాధవరం కృష్ణారావుక కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. ఆయన 30 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. కృష్ణారావు పార్టీ మారడం దాదాపు ఖాయమని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: