హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. రాజేంద్రనగర్, బుద్వేలు, బహదుర్పుర, అత్తాపూర్, పద్మశాలినగర్లో భూప్రకంపనాలు సంభవించాయి. జనాలు భయంతో పరుగులు తీశారు. పలు చోట్ల ఇండ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి.
రాత్రంతా జనాలు జాగారం చేశారు. కంటి మీద కునుకు లేకుండా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్స్కేలుపై 1.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు
.
.