రాజకీయాల్లో ఒక్కో నేతకు ఒక్కో స్టైల్ ఉంటుంది. ప్రత్యర్థుల విమర్శలను సింపుల్ గా తీసిపారేయడంలో.. శత్రువులను అంతే అలవోగా సన్నాసులు, దద్దమలని తిట్టిపోయడం కేసీఆర్ మార్క్ రాజకీయ ఎత్తుగడగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఎలాంటి నేతనైనా తిట్టగల నేత కేసీఆర్.. మోడీని సన్నాసి.. అన్నా.. చంద్రబాబును తెలంగాణకు పట్టి శని అన్నా.. అది కేసీఆర్ కే చెల్లుతుంది. ఐతే.. ఎవరు మాత్రం ఎన్నాళ్లను తిట్లు పడుతూనే ఉంటారు.
అందుకేనేమో ఏపీ డిఫ్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కేసీఆర్ పై ఫుల్లుగా ఫైర్ అయ్యారు. ముల్లును ముల్లుతోనే తీయాలి.. తిట్టును తిట్టుతోనే కొట్టాలి అని అనుకున్నారో ఏమో.. కేఈ కూడా తిట్లపురాణం లంకించుకున్నారు. కేసీఆర్ ఆంధ్రాకు బ్రహ్మరాక్షసుడి మారి వేధిస్తున్నాడని తీవ్రంగా కామెంట్లు చేశారు. ఓ సీఎంను మరో డిఫ్యూటీ సీఎం ఈ రేంజ్ లో తిట్టడం విశేషమే. మరి కేఈకు ఎందుకు అంత కోపం వచ్చింది. అదే అడిగితే.. విభజన జరిగినా కేసీఆర్ అవకాశం వచ్చిన ప్రతి విషయంలోనూ ఆంధ్రాను వేధిస్తున్నారని సమాధానమిచ్చారు.
నీళ్ల దగ్గర పంచాయతీ పెట్టాడు.. కరెంటు దగ్గర పంచాయతీ పెట్టాడు. ఎంసెట్ దగ్గరా అంతే.. ప్రతివిషయంలోనూ మొండిగా మూర్ఖంగా వెళ్తున్నాడు.. ఆంధ్రా పాలిటి బ్రహ్మరాక్షసుడిగా మారాడు.. ఐనా.. ఏదోలా భరిస్తున్నాం అని సమాధానం చెప్పారు. అంతటితో ఆగకుండా.. గవర్నర్ పైనా సునిశితంగా కామెంట్ చేశారు. గవర్నర్ పోస్టు రాజ్యాంగబద్దమైంది.. మోస్ట్ పవర్ ఫుల్ కాబట్టి కాస్త నోరు అదుపులో పెట్టుకున్నా.. మనసులో కోపం తగ్గదు కదా.. అందుకే.. మేం ప్రతి విషయంలోనూ గవర్నర్ కు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం.. మరి ఈ గవర్నర్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థం కావడంలేదని అసహనం వ్యక్తం చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: