తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ చాలా రోజుల తర్వాత మళ్లీ సరదాగా ముచ్చట్లు చెప్పుకొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇచ్చిన 'ఎట్ హోం' విందుకు హాజరైన వీళ్లిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ సీటుకు అటూ ఇటూ ఇద్దరు సీఎంలకు సీట్లు కేటాయించారు.

అయితే గవర్నర్ సీట్లో లేని సమయంలో కేసీఆర్, చంద్రబాబు ఒకొరికొకరు దగ్గరగా వచ్చి మాట్లాడుకున్నారు. దీనిని చూసిన నేతలంతా... ఆ ఇద్దరు సీఎంలు ఏం మాట్లాడుకుని ఉంటారని ఆసక్తిగా చర్చించుకున్నారు. ‘ఏపీ రాజధానిని తుళ్లూరులోనే ఏర్పాటు చేసుకోండి. నదికి అభిముఖంగా రాజధాని నగరం ఉంటే మంచిది..’ అని చంద్రబాబుతో కేసీఆర్ వ్యాఖ్యానించారని తెలిసింది.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: