ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ మృతి మరచిపోకముందే మరో యువ క్రికెటర్ బంతి తగిలి మృతి చెందాడు. పాకిస్తాన్‌లోని ఒరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతుండగా ఈ సంఘటన జరిగింది. జీషన్ మహ్మద్ అనే బ్యాట్స్‌మెన్ ఓ బౌలర్ విసిరిన బంతిని ఆడుతుండగా బంతి తగిలి కింద పడిపోయాడు. బౌలర్ విసిరిన బంతి వేగంగా ఛాతికి తగలడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినా అప్పడికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. బంతి బలంగా ఛాతిని తాకడంతో ఛాతిపై ఒత్తిడి పెరిగి చనిపోయినట్టు వారు చెప్పారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా విషాద చాయలు అలముకున్నాయి. కాగా ఈ సంఘటనపై తమకు ఫిర్యాదులు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఏదేమైనా హ్యూస్ సంఘటన మర్చిపోకముందే మరో యువ క్రికెటర్ బంతి తగిలి చనిపోవడం బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: