పోరాట పటిమ కనబరిచిన రక్షణాధికారి ఒకరు తీవ్రవాదుల తూటాలకు నేలకొరిగారు. గణతంత్ర వేడుకల్లో వీర పురస్కారం అందుకున్నమరుసటి రోజే ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో 42 రాష్ట్రీయ రైఫిల్ కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ ఎంఎం రాయ్ వీర మరణం పొందారు.

త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్ బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. మృతులు ఆదిల్ ఖాన్, షిరాజ్ దార్ గా గుర్తించారు.

ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడిన కల్నల్ రాయ్ బెల్లెట్ గాయాలతో మృతి చెందారు. రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం ఆయన యుద్ధ్ సేవా మెడల్ అందుకున్నారు. పోలీసు కానిస్టేబుల్ మనీష్ కుమార్ కూడా తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

.

మరింత సమాచారం తెలుసుకోండి: