ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టకేలకు ప్రచారం చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. ఢిల్లీలో రోడ్-షో నిర్వహించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీది మాటల సర్కారే కానీ చేతల సర్కారు కాదని రాహుల్ ఆరోపించారు. 2014 మే నెల నుంచీ కేవలం పబ్లిక్ రిలేషన్స్-పైనే ఆధారపడ్డారని రాహుల్ ఆరోపించారు. కేవలం ఇద్దరు- ముగ్గురు పారిశ్రామికవేత్తలపై మోదీ ప్రేమ కురిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. రాహుల్-తో పాటు పార్టీ ప్రచార సారథి అజయ్ మాకెన్, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ ఈ రోడ్-షోలో పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: