సుప్రసిద్ధ టీవీ చానెల్ సీఎన్‌ఎస్-ఐబీఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీవాస్తవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును మంగళవారం సచివాలయంలో కలుసుకున్నారు. తమ సంస్థ తరపున ఆయన సీఎంకు అభినందనలు తెలియజేశారు. సీఎన్‌ఎన్-ఐబీఎన్ సంస్థ ఇండియన్ ఆఫ్ ద ఇయర్-2014 పేరిట ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఓటింగ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ 31 శాతం ఓట్లు సంపాదించి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రఖ్యాత సినీనటులు, జాతీయ నేతలను అధిగమించి ఆయన ఈ స్థానం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది.

.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: