వరంగల్ లోక్ సభ స్థానానికి మంత్రి కడియం శ్రీహరి రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికలో మందా జగన్నాధం లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్ ను నలబెట్టే అవకాశం ఉందని టిఆర్ఎస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్.పి వివేక్ కు అవకాశం ఇస్తే ఆ సమీకరణ వేరుగా ఉంటుంది. అయితే వివేక్ మాల వర్గానికి చెందిన వారు కనుక కొంత మైనస్ అవుతుందని బావిస్తున్నారు.మాదిగ వర్గానికి చెందిన మాజీ ఎమ్.పి మందా జగన్నాధం లేదా పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న విద్యార్ది నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను ఎంపిక చేయాలని ఆలోచన కూడా ఉందని అంటున్నారు. మందా జగన్నాధం సీనియర్ గా ఉన్నా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు.శ్రీనివాస్ మెదక్ జిల్లాకు చెందినవారు.శ్రీనివాస్ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు.ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలని అనుకుంటే ఆయనకు చాన్స్ రావచ్చు.సీనియర్ కు ఇవ్వాలనుకుంటే జగన్నాదంకు దక్కవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: