కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు వివరించారు. తాను పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వివిధ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసే విషయంలో రాహుల్ సిఫార్సులు చేసేవారని ఆమె ఆరోపించారు.

తన శరీరంలో నరనరానా కాంగ్రెస్ రక్తం ఉందని ఆమె చెప్పారు. పార్టీలో ఇప్పటి పరిస్థితులు సంతృప్తికరంగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కాగా, గతంలో ఆమె పలు ప్రముఖ సంస్థలకు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించిన ఆమెపై క్యాబినెట్ సహచరులు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆపై జయంతిని పర్యావరణ శాఖ నుంచి తప్పించారు.

కనీసం తనను ఎందుకు తొలగిస్తున్నారన్న విషయాన్ని కూడా వెల్లడించలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. కాగా, ఆమె మరో పార్టీలో చేరే విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: