ఇటీవలికాలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన సమావేశాలకు కొందరు ముఖ్యులు రాకపోవడం సహజంగానే వార్త అవుతోంది.అసలే పూర్తిగా డిపాజిట్లు పోయిన కాంగ్రెస్ పునరుద్దరణకు ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తంటాలు పడుతున్నా,కొందరు సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం ఆయనకు ఇబ్బందిగా మారుతోంది.

ఎపిసిసి సమావేశం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి రావాల్సిన మెగాస్టార్,కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, అలాగే పిసిసి మాజీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణలు గైర్ హాజరయ్యారు.దీనిపై రఘువీరా రెడ్డి వివరణ ఇస్తూ కేవలం అనారోగ్యం ,ఇతర వ్యక్తిగత సమస్యల వల్ల రాలేదని అన్నారు.

కాగా ప్రత్యేక హోదా అంశంపై కోటి సంతకాల ఉద్యమం చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

...

మరింత సమాచారం తెలుసుకోండి: