తమిళనాడులో జనాలకు సినిమా ఇండస్ట్రీ వాళ్లన్నా, రాజకీయ నాయకులన్నా తెగ అభిమానిస్తుంటారు. ఎంత అభిమానం అంటే తమ వారికి ఏమైనా జరిగితే నిప్పంటిచుకోని చావడమో లేదా వెరైటీగా నిరసన తెల్పడమో లాంటివి అన్నమాట. అలాంటి పిచ్చి అభిమాని చేసిన హంగామా అంతా ఇంతా కాదండి బాబు !

విషయానికి వస్తే... రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి జయలలిత కోసం ఓ వీరాభిమాని తన కాళ్లు, చేతులపై మేకులు కొట్టించుకుని శిలువపై వేలాడాడు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కోసం ఆమె వీరాభిమాని, కరాటే మాస్టర్ షిహన్ హుస్సైని శిలువ ధరించారు. కాలికి, చేతికి మేకు ధరించి ఆమె పుట్టిన రోజు పురస్కరించుకుని పది కాలాల పాటు చల్లగా ఉండాలని, మళ్లీ సీఎం కావాలని ఆశించారు. అంతే కాదు మేకులు కొడుతుంటే ‘అమ్మా .. అమ్మా..’ అంటు తన అభిమానాన్ని చాటుకున్నాడు.

పొడవాటి మేకులను కాలికి చేతికి కొట్టించుకుని జీసస్ తరహాలో అమ్మకోసం శిలువ ధరించి కాసేపు జయలలితను కొనియాడారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌‍లో అమ్మ త్వరలో సీఎం కావాలని ఆకాంక్షించారు. ఆరు నిమిషాల పాటు హుస్సైని అమ్మ కోసం శిలువలోనే ఉండిపోయారు.

కాగా గతంలో అమ్మ కోసం కరాటే మాస్టర్ హుస్సైని రక్తంతోనే జయమ్మ చిత్రపటాన్ని గీశారు. తర్వాత తన రక్తంతో అమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. తన వీరాభిమానాన్ని చాటుకున్నారు. ఏది ఏమైనా కోట్ల రూపాయాలు స్కామ్ లో చిక్కుకున్న జయలలిత ఇఫ్పట్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేదా అనే విషయం ముందు ముందు తెలియాల్సి వుంద.

మరింత సమాచారం తెలుసుకోండి: