హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా పట్టుపడినప్పుడల్లా టాలీవుడ్ షేక్ అవుతుంది. దీనికి కారణం ఎక్కడో అక్కడ దీనికి సంబంధించిన మూలాలు టాలీవుడ్ కి సంబంధాలు ఉంటాయి. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

విషయానికి వస్తే.. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లుగా పక్క సామాచారం అందుకున్న పోలీసులు సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ లో ఆకస్మిక తనికీలు మొదలు పెట్టారు. అప్పడు డ్రగ్స్ ను విక్రయిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ముఠాలో టాలీవుడ్ నిర్మాత శశాంక్ రెడ్డి ముఖ్యుడు అని తెలిసింది. నైజీరియా కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు శశాంక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

వారి వద్ద నుంచి 80 గ్రాముల కొకైన్ స్వాదీనం చేసుకున్నారు. కానీ ఈ ముఠాకు సంబంధించిన ముఖ్య నిందితుడు మాత్రం పోలీసుకు చిక్కలేదు. ఆ నిందితులు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నట్లుగా సమాచారం. అతడి కోసం తీవ్ర గాలింపు చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

అరెస్టయిన వారిపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని తెలిపారు. ఏది ఏమైనా డ్రగ్స్ అక్రమ రవాణా, వాడకం కేసులలో తెలుగు చిత్ర పరిశ్రమ ఇన్ వాల్వ్ కావడం అనేది చిత్ర పరిశ్రమలో ఉన్నవారిని కలవర పెడుతున్న విషయం...

మరింత సమాచారం తెలుసుకోండి: